స్కూల్​ బిల్డింగ్​పై నుంచి దూకినటెన్త్​ స్టూడెంట్

స్కూల్​ బిల్డింగ్​పై నుంచి దూకినటెన్త్​ స్టూడెంట్
  • పరిస్థితి సీరియస్

మియాపూర్​, వెలుగు : మియాపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో  స్కూల్ బిల్డింగ్​ ఐదో ఫ్లోర్​ నుంచి  పదో  తరగతి స్టూడెంట్​దూకాడు. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి.   మియాపూర్ గోకుల్ ప్లాట్స్ కాలనీలో నివాసం ఉంటున్న జె. రవి కుమార్, వాసంతి  దంపతులకొడుకు హరీష్​చంద్ర ప్రసాద్(15)  క్వాంటామ్ లీఫ్ స్కూల్ లో పదో  తరగతి చదువుతున్నాడు.  సోమవారం సాయంత్రం స్కూల్​ అయిపోయాక హరీష్​చంద్ర ప్రసాద్ స్కూల్​ బిల్డింగ్​ 5 వ అంతస్తు పైకి వెళ్లి అక్కడి నుంచి కిందికి దూకాడు.  అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి.  

ఉపాధ్యాయులు  తల్లిదండ్రులకు సమాచారం అందించి,  దగ్గరలోని ఆస్పత్రికి  తరలించారు. పరిస్థితి సీరియస్​గా ఉండడంతో మాదాపూర్​ ఓ కార్పొరేట్​ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్టూడెంట్​  స్కూల్​ బిల్డింగ్​పై నుండి దూకడానికి కారణాలు   తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై తల్లిదండ్రుల నుండి ఏలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు పేర్కొన్నారు.